టీఆర్ఎస్ వచ్చాకే గిరిజనులపై దాడులు: బండి సంజయ్

by  |
టీఆర్ఎస్ వచ్చాకే గిరిజనులపై దాడులు: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే గిరిజనులపై దాడులు పెరిగాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. సూర్యాపేట జిల్లా గుర్రంపోడు తండాలో తమ భూములు కబ్జాకు గురయ్యాయంటూ కొంతమంది గిరిజనులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల వారందరూ వచ్చి బండి సంజయ్‌ను కలిసి న్యాయం చేయాలని కోరారు. ఆదివారం ‘గిరిజన భరోసా యాత్ర’కు బయల్దేరే ముందు బండి సంజయ్ మీడియా మాట్లాడుతూ.. బీజేపీ గిరిజనుల హక్కులను కాపాడుతుందని స్పష్టం చేశారు. పోలీసులు, కేసులు పెట్టి బీజేపీ నేతలను అడ్డుకోలేరని తెలిపారు.

‘గిరిజన భరోసా యాత్ర’కు బండి సంజయ్‌తో పాటు కాషాయం నేతలు రాజాసింగ్, స్వామిగౌడ్, విజయశాంతి, జితేందర్‌రెడ్డి, విజయరామారావు రవీంద్రనాయక్‌, వివేక్ వెళ్లారు.


Next Story