ప్రముఖ బీజేపీ నేత కుమార్తె దారుణ హత్య .. కన్ను పీకేసి, చెట్టుకు వేలాడదీసి

by  |
ప్రముఖ బీజేపీ నేత కుమార్తె దారుణ హత్య .. కన్ను పీకేసి, చెట్టుకు వేలాడదీసి
X

దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్ లో దారుణం జరిగింది. ఒక బాలికను అతికిరాతకంగా హత్య చేసి చెట్టుకు వేలాడతీసారు కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు. బుధవారం లాలిమతి అటవీ ప్రాంతంలోని ఓ చెట్టుకు 16ఏళ్ల టీనేజర్ డెడ్ బాడీ వేలాడుతూ అనుమానస్పద స్థితిలో కనిపించింది. ఆ బాలిక కుడి కన్ను కూడా పీకేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తీ వివరాలు ఇలా ఉన్నాయి.

పంకీ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న స్థానిక బీజేపీ నాయకుడికి ఐదుగురు పిల్లలు. వారిలో పెద్ద కుమార్తె (16) పదో తరగతి చదువుతోంది. జూన్ 7వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ బాలిక ఇంటికి తిరిగిరాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు బుధవారం లాలిమతి అటవీ ప్రాంతంలోని ఓ చెట్టుకు బాలిక మృతదేహం వేలాడుతూ కనిపించింది. ఆ బాలికను స్థానిక బీజేపీ నేత కుమార్తెగా పోలీసులు గుర్తించారు. ఒక గుడ్డతో వేలాడుతూ కుడి వైపు కన్ను లేకుండా కనిపించిందని అధికారులు చెప్పారు. అంతేకాకుండా ఆమెను నిర్దయగా కొట్టడమే కాకుండా చెట్టుకు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరింంచేందుకు దారుణంగా హింసించారు అని సూసైడ్ స్పాట్ స్పష్టం చేస్తుంది. ఇక ఈ ఘటనతో పంకీ పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతమంతా ఉలిక్కిపడింది.

బాలికను అంత దారుణంగా హింసించి చంపాల్సిన అవసరం ఏముందని, ఈ హత్య వెనుక రాజకీయ హస్తాలు ఏమైనా ఉన్నాయా ..? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. నేరం జరిగిన ప్రదేశం నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ కాల్‌డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు ప్రదీప్ కుమార్ సింగ్ ధనుక్(23) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రదీప్ కుమార్‌కు ఇప్పటికే పెళ్లి అయిందని.. అతడు అనుచరులను కలిగి ఉండవచ్చని పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed