నడిరోడ్డుపై బీజేపీ నేత దారుణ హత్య

by  |
నడిరోడ్డుపై బీజేపీ నేత దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్: ఝార్ఖండ్‌లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ఓ పార్టీకి చెందిన నాయకుడిని నడిరోడ్డుపై కాల్చి చంపారు దుండగులు. ఈ ఘటన దన్‌బాద్‌లోని బాక్‌మోర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నగర బీజేపీ ఉపాధ్యక్షుడు సతీశ్ సింగ్ తన కారులో నుంచి దిగి ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు మాస్క్‌లు ధరించి బైక్‌పై వచ్చి సతీశ్ తలపై కాల్చి, అక్కడి నుంచి క్షణాల్లో పరారయ్యారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించే‌లోపు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన దృష్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు.

Next Story

Most Viewed