- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాచారం ఎంపీపీకి మురళీధర్రావు పరామర్శ
<p>దిశ, రంగారెడ్డి: అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. ఫార్మాసీటీ రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమానికి తనను ఎందుకు ఆహ్వానించలేదని యాచారం ఎంపీపీ సుకన్య అడిగినందుకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పోలీసులు నెట్టివేయడంతో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిందన్నారు. సదరు ఎమ్మెల్యే తీరుపై బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎంపీపీకి జరిగిన అవమానాన్ని తెలుసుకున్న మురళీధర్రావు యాచారంలోని ఆమె నివాసానికి వెళ్లి […]</p>

దిశ, రంగారెడ్డి: అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. ఫార్మాసీటీ రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమానికి తనను ఎందుకు ఆహ్వానించలేదని యాచారం ఎంపీపీ సుకన్య అడిగినందుకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పోలీసులు నెట్టివేయడంతో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిందన్నారు. సదరు ఎమ్మెల్యే తీరుపై బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎంపీపీకి జరిగిన అవమానాన్ని తెలుసుకున్న మురళీధర్రావు యాచారంలోని ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు దళిత మహిళా అని చూడకుండా ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ దాడిపై ముఖ్యమంత్రి స్పందిచకపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా పార్టీ పోరాడుతున్నారు.






