- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన పేరిట ప్రజలను మరోసారి మోసం చేశారని, గత రెండేళ్లుగా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్లో దర్శనీయ స్థలం అవుతుందేతప్ప, ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదని, కేసీఆర్ ఇప్పటికైనా డ్రామాలు ఆపాలన్నారు.
కేంద్రానికి ఇచ్చిన డీపీఆర్లో 17.50లక్షల ఎకరాలనే వివరించారని, కానీ రాష్ట్ర ప్రజలకు మాత్రం కోటి ఎకరాలకు నీరు అంటూ వంచిస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు పెట్టి.. ఇప్పుడు మూడో టీఎంసీ అంటూ ముచ్చట చెబుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర జలవనరులశాఖ డీపీఆర్ ఇవ్వమంటే ఇప్పటివరకు ఇవ్వలేదని, అది ఇస్తే కేసీఆర్ బండారమంతా బయటపడుతుందన్నారు.
కాళేశ్వరం డీపీఆర్ కేంద్రం ముందు పెట్టాలని, ఈ విషయంలో ఎక్కడైనా చర్చకు మేం సిద్ధమని బండి సజయ్ సవాల్ విసిరారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరని, కాళేశ్వరంలో పూజలు చేస్తే పాపాలు పోవన్నారు. కేసీఆర్ పర్యటనను ఎవరూ పట్టించుకోలేదని విమర్శించిన బండి సంజయ్.. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ ఫెయిలయ్యిందన్నారు.