హయత్ నగర్‌ డివిజన్ బీజేపీదే..

by Shyam |
హయత్ నగర్‌ డివిజన్ బీజేపీదే..
X

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కమలం పార్టీ తొలి విజయాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఆ పార్టీకి ఇద్దరు సిట్టింగ్ కార్పొరేటర్లు ఉన్నారు. గ్రేటర్-2020 ఓట్ల లెక్కింపులో ఎట్టకేలకు బీజేపీ పార్టీ ఖాతా తెరిచింది. హయత్ నగర్ డివిజన్‌ బీజేపీ అభ్యర్థి నవజీవన్ రెడ్డి గెలుపొందారు.

ఇక్కడ టీఆర్‌ఎస్ నుంచి సామా తిరుమల్ రెడ్డి పోటీ చేయగా.. కాంగ్రెస్ నుంచి జి.శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉన్నారు. అధికార పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిపై స్థానికంగా ఉన్న వ్యతిరేకతతో పాటు బీజేపీ క్షేత్రస్థాయిలో పట్టు సాధించడం ఆ పార్టీకి కలిసోచ్చిందని స్థానిక నేతలు చెబుతున్నారు.

Next Story

Most Viewed