అందుకే భార్గవ్ రామ్ అజ్ఞాతంలోకి: భూమా మౌనిక రెడ్డి

by  |
అందుకే భార్గవ్ రామ్ అజ్ఞాతంలోకి: భూమా మౌనిక రెడ్డి
X

దిశ,వెబ్ డెస్క్: తెలంగాణలో పక్క రాష్ట్రం వారు వచ్చి బతికే పరిస్థితి కనిపించడం లేదని భూమా మౌనిక రెడ్డి అన్నారు. అర్ధ రాత్రి మహిళా పోలీసులు లేకుండా అఖిల ప్రియను తీసుకు వెళ్లారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేస్తే విచారణ చేయాలనీ..కానీ ఉద్దేశ్య పూర్వకంగా చేయడం సరికాదన్నారు. గాంధీలో అక్క పడిపోతే కూడా పట్టించుకోలేదని వాపోయారు.

తాము ఇక్కడే పెరిగామని తెలిపారు. తమ కుటుంబం చాలా కాలంగా రాజకీయాల్లో ఉందన్నారు. ప్రవీణ్ రావు కేసీఆర్ బంధువని..అందుకే తమపై ఈ రకంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఏం చేస్తారో అనే భయంతో భార్గవ్ రామ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని చెప్పారు. టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉంటేనే ఈ రాష్ట్రంలో ఉండాలని చెప్పారు. భూ వివాదానికి సంబంధించి ప్రవీణ్ కుటుంబం వస్తే మాట్లాడేందుకు తాము సిద్దమని వెల్లడించారు.

Next Story

Most Viewed