ఘనంగా భూలక్ష్మీ విగ్రహ ప్రతిష్టాపన.. హాజరైన MLA గండ్ర దంపతులు

by  |
ఘనంగా భూలక్ష్మీ విగ్రహ ప్రతిష్టాపన.. హాజరైన MLA గండ్ర దంపతులు
X

దిశ, మొగుళ్లపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పర్లపల్లి గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ భూలక్ష్మీ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. ఈరోజు అత్యంత వైభవంగా గ్రామ ప్రజలందరూ సంతోషకరమైన వాతావరణంలో శ్రీ భూలక్ష్మీ మాత విగ్రహ పండుగను జరుపుకుంటున్నారని అన్నారు.

అమ్మ వారి ఆశీస్సులతో ప్రజలందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. పంటలు మంచిగా పండాలని, కరోనా మహమ్మారి వంటి వ్యాధుల నుండి ప్రజలందరూ పూర్తిగా దూరమై ఆరోగ్యంగా ఉండాలని కోరారు. అనంతరం రూ. 50 వేలను విరాళంగా ఆలయ కమిటీ చైర్మన్, గ్రామ సర్పంచ్ జోరుక ప్రేమలతకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జోరుక సదయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతి రావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Next Story