జనసేనానితో బండి సంజయ్ భేటీ

by  |
జనసేనానితో బండి సంజయ్ భేటీ
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో తెలంగాణ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ ఆఫీసులో ఇరువురు నేతలు సోమవారం సమావేశం అయ్యారు. దీంతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీ రాష్ర్ట అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ బండి సంజయ్‌కు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలోనూ కలిసి పనిచేయాలని ఇరుపార్టీలు చూస్తున్నట్టు సమాచారం. మర్యాదపూర్వక భేటీ అని బీజేపీ పార్టీ నేతలు చెబుతున్నారు.



Next Story

Most Viewed