13 మందితో వెళ్తున్న ఆటో బోల్తా, ఒకరు మృతి 

by  |
13 మందితో వెళ్తున్న ఆటో బోల్తా, ఒకరు మృతి 
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా శింగనమల మండలం పోతురాజు కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న ఆటో బోల్తా పడింది.కూలి పనుల కోసం కొత్తపల్లి నుండి గార్లెదిన్నె మండలం, సిరివరానికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆటో టైర్ పంక్చర్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో జ్యోతి అనే పదహారేళ్ళ యువతి అక్కడికక్కడే మృతి చెందగా… మరో 13 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కాగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Next Story