వాగులో ఆటో బోల్తా.. కూలీ మృతి

by  |
వాగులో ఆటో బోల్తా.. కూలీ మృతి
X

దిశ, దేవరకొండ: వారంతా కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజు మాదిరే కూలీ పనులకు శుక్రవారం వెళ్లారు. వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం తిరుగు పయనం అయ్యారు. అప్పటికే వర్షం భారీగా పడుతోంది. కూలీలతో వస్తున్న ఆటో మార్గమధ్యలో వస్తుండగా వాగు దాటే క్రమంలో వరద ఉధృతికి అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఒకరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. మాల్ నుంచి కిష్టారాంపల్లి కి కూలీలతో వెళ్తున్న ఆటో కురంపల్లి వద్ద వాగు దాటే క్రమంలో బోల్తా పడంతో కొట్టే రాములమ్మ(60) అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురు కూలీలు గాయపడ్డారు.

Next Story