ఎస్ఐ వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య యత్నం

by  |
ఎస్ఐ వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య యత్నం
X

దిశ, మెదక్: స్థానిక ఎస్ఐ రమేష్ ఓ భూవివాదంలో ఇబ్బంది పెడుతున్నాడని తీవ్ర మనస్తాపం చెందిన కంచనపల్లి శేఖర్ అనే వ్యక్తి మంగళవారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివ్వంపేట మండలం కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

వివరాల ఇలా ప్రకారం…తన ఎకరం భూమిని పందిరి గౌడ్,సత్యనారాయణ గౌడ్,శేఖర్ గౌడ్ ల మధ్యవర్తిత్వంతో రూ. 30 లక్షల రూపాయలకు విక్రహించి అగ్రిమెంట్ చేసుకున్నాడు. 8 నెలలు గడుస్తున్నా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు,అగ్రిమెంట్ టైమ్ ముగిసింది, ప్రస్తుతం భూమి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి,పాత ధర ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాలని వారు డిమాండ్ చేశారు,అందుకు శేఖర్ ఒప్పుకోలేదు…దీంతో వారి మధ్య గొడవలు జరిగాయి,రెండు రోజుల క్రితం కొత్తపల్లిలో శేఖర్ ఇంటి దగ్గర శేఖర్ గౌడ్ అమ్మతో గొడవ జరిగింది, దీంతో శేఖర్ పై శివ్వంపేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు.

రెండు రోజులుగా ఎస్ఐ రమేష్ పోలీస్ స్టేషన్ కు పిలిచి నాన బూతు మాటలతో మానసికంగా హింసించాడు. 40 వేలు ఇస్తే నీకు సపోర్ట్ చేస్తానని లేకపోతే వాళ్లకు సపోర్ట్ చేసి తనపై కేసు నమోదు చేస్తానని ఎస్ఐ రమేష్ బెదిరించాడని బాధితుడు శేఖర్ తెలిపారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన శేఖర్ మంగళవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. ప్రస్తుతం శేఖర్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కి తరలించారు.తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఎస్ఐ రమేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు,గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed