ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం లేద‌ని కానిస్టేబుల్ ఆత్మహ‌త్యాయ‌త్నం

by  |
constable
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : ట్రాన్స్‌ఫర్ చేయడం లేదని మనస్తాపానికి గురైన ఓ కానిస్టేబుల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో శుక్రవారం ఉద‌యం జరిగిందీ ఘటన. వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా నల్లబెల్లి మండ‌ల‌ కేంద్రానికి చెందిన అహ్మద్‌ పాషా.. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నాడు. తనను అక్కడి నుంచి వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు ట్రాన్స్‌ఫర్‌ చేయడం లేదనే కారణంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలుస్తోంది. పురుగులమందు తాగిన హైమద్‌ పాషాను స‌హ‌చ‌ర ఉద్యోగులు వెంటనే ఎంజీఎంకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story