మైనర్ బాలిక పై అత్యాచారయత్నం

by  |
మైనర్ బాలిక పై అత్యాచారయత్నం
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మైనర్ బాలిక పై హత్యాచారయత్నం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సోమవారం అర్థరాత్రి ఈ ఘటప చోటు చేసుకుంది. 16 ఏళ్ల మైనర్ బాలిక తను ప్రేమికుడితో 4 ఇంక్లైన్ గడ్డకు వెళ్లి ముచ్చటిస్తోంది. వీరిని గమనించిన ముగ్గురు యువకులు బాలికను కత్తులు చూపించి, బలవంతంగా ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారు.

బాలిక కేకలు వేయడంతో సంజయ్ నగర్, గాంధీనగర్ కాలనీ స్థానికులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో మైనర్ పై అఘాయిత్యానికి ప్రయత్నించిన ఆగంతకులు పారిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుల ఆచూకి కోసం వేట మొదలు పెట్టారు.


Next Story

Most Viewed