మామపై కోడలు హత్యాయత్నం..

by  |
మామపై కోడలు హత్యాయత్నం..
X

దిశ, వెబ్‌డెస్క్ : కొడుకు చనిపోయినా.. చేరదీసి ఆలనాపాలన చూసుకుంటున్న మామనే హత్య చేయాలని చూసింది ఓ కోడలు. కారణాలు తెలియకపోయినా.. తనకు కొడుకు వరసయ్యే బాలుడితో కలిసి చంపడానికి ప్లాన్ చేసి అడ్డంగా దొరికిపోయింది. ఆదరించిన మామనే అంతమొందించాలనుకున్న ఆ కోడలును పోలీసులు అరెస్టు చేశారు.

వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలం ఎన్కతల గ్రామానికి చెందిన కిష్టయ్యకు ఇద్దరు కుమారులు. వారిద్దరి పెళ్లిలు అయిన తర్వాత వివిధ కారణాలతో ఇద్దరూ చనిపోయారు. దీంతో పెద్ద కోడలు భాగ్యమ్మ మామ వద్దనే ఉంటుంది. రెండో కోడలుకు మామనే మరో వ్యక్తితో వివాహం జరిపించాడు. చిన్న కోడలు రెండో భర్తకు 14 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అతడిని మామకు తోడుగా ఎన్కతలలోనే ఉంచింది. కిష్టయ్యకు ఉన్న ఎకరంన్నర భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు.

ఇదిలా ఉండగా పెద్ద కోడలు భాగ్యమ్మ మనసులో దుర్భుద్ది పుట్టి మామను హత్య చేయడానికి ప్రణాళిక రచించింది. దీనికి చిన్న కోడలు కోడుకును పావుగా వాడుకున్నది. మామ కిష్టయ్య తినే అన్నంలో పురుగుల మందు కలపాల్సిందిగా బాలుడిని కోరింది. పెద్దమ్మ సూచన ప్రకారం శుక్రవారం తాత తినే పప్పులో మందు కలిపాడు. అది తిన్న కిష్టయ్య అస్వస్థకు గురయ్యాడు. తనపై గ్రామస్థులకు అనుమానం రాకుండా ఉండేందుకు భాగ్యమ్మే తన మామను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది.

విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామస్థులు అందించిన సమాచారంతో బాలుడిని అదుపులోకి తీసుకోని విచారించారు. భయపడిన బాలుడు జరిగింది మొత్తం చెప్పడంతో హత్యాయత్నం కోణం బయటపడింది. పోలీసులు బాలుడిని, భాగ్యమ్మను అదుపులోకి తీసుకున్నారు. కాగా మామపై ఎందుకు హత్యాయత్నం చేసిందో తెలియరాలేదు. ఆస్తి కోసమే ఆమె హత్యాయత్నం చేసినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed