ఎయిర్ పోర్ట్ ఉద్యోగిపై బీరు సీసాలతో దాడి

by  |
Attack
X

దిశ, వెబ్‌డెస్క్ : రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి జరిగింది. మండలంలోని నాగారం గ్రామానికి చెందిన సయ్యద్ అజ్మత్ ఎయిర్ పోర్టులో పని చేస్తాడు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో వలిగొండ మండల కేంద్రంలో లోతుకుంట రోడ్డులో వెళ్తున్న అజ్మత్‌పై గుర్తు తెలియని 15 మంది దుండగులు బీరు సీసాలతో మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వచ్చిన స్థానికులను చూసి దుండగులు పారిపోయారు. బాధితుడిని చికిత్స నిమిత్తం రామన్నపేట ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Next Story

Most Viewed