- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి జరిగింది. మండలంలోని నాగారం గ్రామానికి చెందిన సయ్యద్ అజ్మత్ ఎయిర్ పోర్టులో పని చేస్తాడు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో వలిగొండ మండల కేంద్రంలో లోతుకుంట రోడ్డులో వెళ్తున్న అజ్మత్పై గుర్తు తెలియని 15 మంది దుండగులు బీరు సీసాలతో మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వచ్చిన స్థానికులను చూసి దుండగులు పారిపోయారు. బాధితుడిని చికిత్స నిమిత్తం రామన్నపేట ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Next Story