కరోనాతో ఏఆర్ ఎస్సై మృతి

by Vadlamudi Anukaran |   (  Updated:2020-07-21 02:44:25  IST  )

<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని 7వ పోలిస్ బెటాలియన్ కు చెందిన ఏఆర్ ఎస్సై కరోనాతో చనిపోయారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ లో పనిచేయుచున్నఏఆర్ ఎస్సై ఎండి హమీద్(45) సోమవారం రాత్రి నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా మేడ్చల్ వద్ద మృతిచెందాడు. హమిద్ కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 7వ బెటాలియన్ లో కానిస్టేబుల్ గా 1994 చేరి ఇప్పటి వరకు [&hellip;]</p>

కరోనాతో ఏఆర్ ఎస్సై మృతి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని 7వ పోలిస్ బెటాలియన్ కు చెందిన ఏఆర్ ఎస్సై కరోనాతో చనిపోయారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ లో పనిచేయుచున్నఏఆర్ ఎస్సై ఎండి హమీద్(45) సోమవారం రాత్రి నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా మేడ్చల్ వద్ద మృతిచెందాడు. హమిద్ కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 7వ బెటాలియన్ లో కానిస్టేబుల్ గా 1994 చేరి ఇప్పటి వరకు 26 సంవత్సరాల సర్వీసు పూర్తి చేశారు. హమీద్ బోధన్ వాసి. హమీద్ మృతి పట్ల బెటాలియన్ కమాండెంట్ సత్య శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ హమీద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హమీద్ మృతి కరోనాతో ఉమ్మడి జిల్లా పోలిస్ శాఖలో రెండవ మరణం.

Next Story