గాంధీభవన్‌కు వాస్తు మార్పులు!

by  |
Gandhi Bhavan
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర కాంగ్రెస్​ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌కు వాస్తు మార్పులు చేయనున్నారు. టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి నియామకం తర్వాత గాంధీభవన్​లో పలు మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 7న గాంధీభవన్​కు రేవంత్​ వెళ్లనున్నారు. అదేరోజు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం పెద్దమ్మతల్లి ఆలయం దగ్గర పూజలు చేసి, నాంపల్లి దర్గా మీదుగా గాంధీభవన్​కు వెళ్లి మధ్యాహ్నం 12 గంటలకు బాధ్యతలను స్వీకరించనున్నారు. అయితే ముందుగా లక్ష మందితో ఈ కార్యక్రమం నిర్వహించాలనుకున్నా… కొవిడ్​ నేపథ్యంలో పరిమితులు విధిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక వాస్తు మార్పుల్లో భాగంగా గాంధీభవన్​ తూర్పులో మరో ద్వారం ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత పీసీసీ చీఫ్‌ ఛాంబర్‌ తూర్పులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఇప్పుడు ఉన్న పీసీసీ ఛాంబర్​ను ఖాళీ చేయనున్నారు. అదే విధంగా గాంధీ భవన్‌లో పార్టీ జెండాలు విక్రయించే గదితో పాటుగా సెక్యూరిటీ రూమ్‌ను తొలగించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. రేవంత్‌ ప్రమాణస్వీకారం నాటికి పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు.



Next Story

Most Viewed