మైనారిటీల అభివృద్దికి కృషి చేస్తా : గంధం చంద్రుడు

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-07-28 04:54:04  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తానని ఏపీ మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి గంధం చంద్రుడు స్పష్టం చేశారు. మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులైన ఆయన బుధవారం సచివాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. శాఖకు సంబంధించిన విభిన్న అంశాలను అధికారులు ప్రత్యేక కార్యదర్శికి వివరించారు. మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి విశేష ప్రాధన్యత ఇస్తూ వారి ఆర్ధిక స్వావలంబనకు బాటలు వేస్తున్నారని ఆ [&hellip;]</p>

మైనారిటీల అభివృద్దికి కృషి చేస్తా : గంధం చంద్రుడు
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తానని ఏపీ మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి గంధం చంద్రుడు స్పష్టం చేశారు. మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులైన ఆయన బుధవారం సచివాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. శాఖకు సంబంధించిన విభిన్న అంశాలను అధికారులు ప్రత్యేక కార్యదర్శికి వివరించారు. మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి విశేష ప్రాధన్యత ఇస్తూ వారి ఆర్ధిక స్వావలంబనకు బాటలు వేస్తున్నారని ఆ క్రమంలో అధికారులు మెరుగైన పనితీరును ప్రదర్శించాలని గంధం చంద్రుడు ఆదేశించారు.

Next Story