కుర్చీలతో కొట్టుకున్న న్యాయవాదులు.. ఎక్కడో తెలుసా..?

by  |
కుర్చీలతో కొట్టుకున్న న్యాయవాదులు.. ఎక్కడో తెలుసా..?
X

దిశ, వెబ్‎డెస్క్: న్యాయవాదులు కుర్చీలతో కొట్టుకోవడమేంటని అనుకుంటున్నారా.. అది కూడా అక్కడిక్కడ కాదండి ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో కుర్చీలు విరిగే విధంగా కొట్టుకున్నారు. బార్ కౌన్సిల్ ఎన్నికలపై చర్చించేందుకు ఈ సమావేశమైన న్యాయవాదుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో ఉద్రిక్తతలకు దారితీసింది.

ఈ ఘర్షణలో బార్ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్ కుమార్ తలకు దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో అజయ్ కుమార్, ఇతర న్యాయవాదులు హైకోర్టు సీజేఐని కలిసేందుకు ప్రయత్నించారు. కాగా, ఈ సమావేశంలో న్యాయవాదులు రాయలసీమ, కోస్తా వర్గాలుగా విడిపోయి పరస్పరం ఘర్షణకు దిగినట్టు సమాచారం. పోలీసుల జోక్యంతో న్యాయవాదులు శాంతించినట్లు తెలుస్తుంది.



Next Story