బ్రేకింగ్: ఇంటర్ పరీక్షలు అప్పటినుంచే.. ఏపీ ప్రభుత్వం ప్రకటన

by  |
బ్రేకింగ్: ఇంటర్ పరీక్షలు అప్పటినుంచే.. ఏపీ ప్రభుత్వం ప్రకటన
X

దిశ, ఏపీ బ్యూరో: జూలై మెుదటి వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. జూలై చివరి వారంలో టెన్త్ పరీక్షల నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పరీక్షల ఏర్పాట్లపై చర్చించి తుది నిర్ణయం వెల్లడిస్తామని తెలిపారు. విద్యార్థుల ప్రయోజనం కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నారా లోకేశ్ పరీక్షలు రద్దు చేయాలంటూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఇకపోతే కరోనా దృష్ట్యా రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే పరీక్షలు నిర్వహించొద్దని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే… పరీక్షలు నిర్వహించి తీరుతామంటూ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

Next Story

Most Viewed