సుపరిపాలనే లక్ష్యంగా ముందుకు సాగాలి…

by  |
సుపరిపాలనే లక్ష్యంగా ముందుకు సాగాలి…
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రజలకు ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు. అభివృద్ది ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరాలని ఆయన ఆకాంక్షించారు. నిరుపేదలకు అవసరమైన సంక్షేమ , అభివృద్ది పథకాలను ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన తెలిపారు. ప్రజలే ప్రాధాన్యతగా ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను కొనసాగించాలని ఆయన సూచించారు. ప్రజల ఆనందకరమైన జీవనమే ఏ ప్రభుత్వానికైనా విజయ సూచిక అని తెలిపారు. పారదర్శకత, సుపరిపాలనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగాలని ఆయన అన్నారు. సామాన్యుల కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.

Next Story

Most Viewed