ఆరోగ్యశ్రీలోకి కరోనా చికిత్సలు

by  |
ఆరోగ్యశ్రీలోకి కరోనా చికిత్సలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ వేల వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతూ, ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులు, నిర్ధారణ అయిన వారి చికిత్సలను ఆరోగ్య శ్రీలో చేర్చింది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్.జవహార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా చికిత్సకు అయ్యే ఖర్చుల వివరాలను కూడా ప్రకటించారు. కరోనా సోకిన వారితో పాటు కాంటాక్ట్ అయిన వారికి కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు. దీంతో అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా రోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.

Next Story

Most Viewed