- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకు ఏపీ ప్రభుత్వం..!
by Vemula.Srinu Prasad |
<p>స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రమేష్ ఆస్పత్రి ఎండీ రమేష్ బాబు, చైర్మన్ సీతారాం మోహన్పై తదుపరి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత మంగళవారం డాక్టర్ రమేష్తో పాటు ఆస్పత్రి చైర్మన్పై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన హైకోర్టు.. […]</p>

X
స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రమేష్ ఆస్పత్రి ఎండీ రమేష్ బాబు, చైర్మన్ సీతారాం మోహన్పై తదుపరి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత మంగళవారం డాక్టర్ రమేష్తో పాటు ఆస్పత్రి చైర్మన్పై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన హైకోర్టు.. స్వర్ణ ప్యాలెస్ను క్వారంటైన్ సెంటర్గా అనుమతిచ్చిన అధికారులను ఎందుకు బాధ్యులను చేయలేదని ప్రశ్నించింది. ఈ ఘటనలో అధికారులు తప్పు కూడా ఉందని.. దీనికి వారు కూడా బాధ్యులేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఆగస్టు 9వ తేదీన విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.
Next Story






