ఏపీలో తగ్గిన కేసులు.. పెరిగిన మరణాలు

by  |
AP corona Update
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా వెలువడిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 19,981 కరోనా కేసులు నమోదు కాగా, 118 మంది మృతి చెందారు. కొత్త కేసులతో కలిపి ఏపీలో ప్రస్తుతం 2,10,683 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 10,022 మరణాలు సంభవించాయి. జిల్లాల వారీగా చూసుకుంటే పశ్చిమ గోదావరిలో 15 మంది, చిత్తూరులో 14, తూర్పుగోదావరిలో 11, విశాఖలో 11, గుంటూరులో 10 చొప్పున కరోనా రోగులు మృతిచెందినట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.



Next Story