ఫైనల్లో ఇండియా.. ట్విట్టర్‌లో అనుష్క

by  |
ఫైనల్లో ఇండియా.. ట్విట్టర్‌లో అనుష్క
X

బాలీవుడ్ నటి, టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ చేసిన ట్వీట్ క్రికెట్ అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. గతంలో క్రికెట్‌ గురించి పెద్దగా పట్టించుకోని అనుష్క..కోహ్లీని వివాహం చేసుకున్న తర్వాతే తనకు క్రికెట్ గురించిన ఓనమాలు తెలిశాయని ఓ ఇంటర్వూలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

కాగా, ఈ మధ్య అనుష్క క్రికెట్‌ను విపరీతంగా ఫాలో అవుతోంది. గురువారం భారత మహిళా జట్టు తొలిసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ వార్త తెలిసిన కొద్ది సేపటికే భారత జట్టును అభినందిస్తూ అనుష్క ట్వీట్ చేసింది. హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలో భారత జట్టు అద్భుత విజయాలు సాధిస్తోందని.. తొలిసారి ఫైనల్లోకి అడుగపెట్టి చరిత్ర సృష్టించిన భారత జట్టుకు అభినందనలు తెలిపింది. మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం బాధాకరమే అయినా.. భారత జట్టుకు ఫైనల్లో అడుగుపెట్టే అర్హత ఉందని పేర్కొంది. మార్చి 8న జరగబోయే ఫైనల్స్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు అనుష్క ట్వీట్‌లో వెల్లడించింది.

tags : ICC Women WT20, Ind vs England, Bollywood Actor Anushka, Twitter, Kohli


Next Story

Most Viewed