జామియా దగ్గర మళ్లీ కాల్పులు

by  |
జామియా దగ్గర మళ్లీ కాల్పులు
X

దివారం రాత్రి దక్షిణ ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ దగ్గర మళ్లీ కాల్పులు జరిగాయి. స్కూటీ మీద వెళ్తున్న ఓ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఐదో నెంబర్ గేటు వద్ద గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని జామియా కోఆర్డినేషన్ కమిటీ తెలిపింది.

సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో జామియా వద్ద గత నాలుగు రోజుల్లో జరిగిన మూడో కాల్పుల సంఘటన ఇది. షాహీన్ బాగ్‌కి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలియజేశారు. సంఘటనా స్థలానికి వెళ్లి వెతకగా అక్కడ ఎలాంటి బుల్లెట్ షెల్స్ దొరకలేదని పోలీసులు అన్నారు.

Next Story