- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: పుదుచ్చేరిలో కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే లక్ష్మీనారాయణన్ తన రాజీనామాను సభాపతికి అందజేశారు. పుదుచ్చేరి అసెంబ్లీలో రేపు సాయంత్రం 5 గంటలకు బలపరీక్ష నిర్వహించనున్నారు. బలపరీక్షకు ముందే లక్ష్మీనారాయణన్ రాజీనామ చేయడంతో కాంగ్రెస్కు ఊహించని షాక్ తగిలింది.
కాగా పుదుచ్చేరి శాసనసభలో మొత్తం 33 మంది శాసన సభ్యులు ఉన్నారు. శాసనసభలో మెజారిటీకి 15 మంది సభ్యులు అవసరం ఉంది. ఇప్పటికే వివిధ కారణాలతో శాసనసభలో ఐదు ఖాళీలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్కు ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో ఆ పార్టీ బలం 13కు పడిపోయింది. విపక్షాలకు శాసనసభలో 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తాజా రాజీనామతో బలపరీక్ష మరింత ఉత్కంఠగా మారింది.
Next Story