అంగన్వాడీ టీచర్ నిర్లక్ష్యం.. చిన్నారి మృతి

by  |
Aditya
X

దిశ, పిట్లం: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం రాచూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అంగన్వాడీ టీచర్ నిర్లక్ష్యం మూలంగా ఐదేళ్ల చిన్నారి మృతిచెందింది. వివరాల్లోకి వెళితే.. రాచూర్ గ్రామానికి చెందిన సూర్యకాంత్-జ్యోతికల కూతురు ఆదిత్య(5)ను రోజులాగే అంగన్వాడీ సెంటర్‌కు పంపించారు. సెంటర్‌లో మరుగుదొడ్లు కడిగే కెమికల్‌ను చిన్నారి సేవించి అస్వస్థతకు గురయ్యింది. గమనించిన సిబ్బంది చిన్నారిని దెగ్లూర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి, నిజామాబాద్‌కు తరలించే క్రమంలో మృతిచెందింది. తమ కూతురు చనిపోవడానికి కారణమైన అంగన్వాడీ టీచర్‌ను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed