- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, గజ్వేల్ : మెదక్ జిల్లా గజ్వేల్ మండలం బయ్యారంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనుకోకుండా పాము కాటు వేయడంతో చిన్నారి మృతి చెందింది. వివరాల్లోకివెళితే.. మండల పరిధిలోని బయ్యారం గ్రామంలో నివాసముంటున్న రాజు దంపతుల నాలుగేళ్ల కూతురు నిత్య శ్రీ స్థానికంగా ఉండే అంగన్వాడీ స్కూల్కు వెళ్లింది.
అక్కడ అనుకోకుండా చిన్నారిని పాము కాటు వేసింది. ఆ విషయాన్ని అంగన్వాడీ టీచర్, చిన్నారి తల్లి గుర్తించకపోవడంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. కాగా, చిన్నారి కాలి భాగంలో ఉన్న గుర్తులను బంధువులు గుర్తించి పాము కాటు వేసినట్టు నిర్ణయానికి వచ్చారు.
Next Story