రాయచోటిలో దారుణం.. పెట్రోల్ ట్యాంకులో పడి ముగ్గురు మృతి

by Disha Web Desk 16 |
రాయచోటిలో దారుణం.. పెట్రోల్ ట్యాంకులో పడి ముగ్గురు మృతి
X

దిశ,కడప:అన్నమయ్య జిల్లా రాయచోటిలో దారుణం జరిగింది. బషీర్ ఖాన్ పెట్రోల్ పంపులో పెట్రోల్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడి ముగ్గురు మృతి చెందారు. హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం పెట్రోల్ ట్యాంక్ క్లీన్ చేయడానికి కడప జిల్లా పెండ్లిమర్రి మండలానికి చెందిన నాగేంద్ర (40), రవి (33), చింతకొమ్మదిన్నెకు చెందిన శివ (36) వెళ్లారు. ఒకరు ట్యాంక్‌లో పడ్డారు. ఆయన రక్షించే క్రమంలో మరో ఇద్దరు కూడా ట్యాంకులో పడ్డారు. ఊపిరి ఆడక ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు



Next Story

Most Viewed