Kadapa: వైసీపీ నేతలపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం.. అడ్డొస్తే అడ్రస్‌లు ఉండవని స్ట్రాంగ్ వార్నింగ్

by Disha Web Desk 16 |
Kadapa: వైసీపీ నేతలపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం.. అడ్డొస్తే అడ్రస్‌లు ఉండవని స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: తన దారికి అడ్డొస్తే వైసీపీ వాళ్ల అడ్రస్‌లుండవని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. కడప జిల్లా చెన్నూరులో యువగళం పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన సీఎం జగన్, వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో ప్రజా గర్జన చూసి సీఎం జగన్‌కు నిద్రపట్టడం లేదని విమర్శించారు. సైక్ బ్యాక్‌కు షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చేది తానేనని చెప్పారు. రెచ్చిపోతున్న వైసీపీ నేతలను వదిలిపెట్టేది లేదని నారా లోకేశ్ హెచ్చరించారు.

ఇక ప్రకాశం జిల్లా కొండపి టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల‌వీరాంజ‌నేయ‌ స్వామి అరెస్ట్‌ను ఖండించారు. వైసీపీ స‌ర్కారు సైకోయిజానికి ప‌రాకాష్ట బాల‌వీరాంజ‌నేయ‌స్వామి అరెస్టు అని మండిపడ్డారు. శాంత‌స్వభావి, ద‌ళిత మేధావి అయిన డాక్టర్ స్వామి జ‌గ‌న్ స‌ర్కారు అవినీతిని ప్రశ్నిస్తున్నార‌నే ప‌దేప‌దే టార్గెట్ చేసి మ‌రీ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉండి, విప‌క్ష ద‌ళిత ఎమ్మెల్యే ఇల్లు ముట్టడించ‌డం అంటే ముమ్మాటికీ క‌క్ష సాధింపేననని నారా లోకేశ్ ధ్వజమెత్తారు.


Next Story

Most Viewed