- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సజ్జల జగన్ సీటు ఎందుకు ప్రకటించలేదు?.. బోండా ఉమ ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ- జనసేన మొదటి జాబితాకే వైసీపీ నేతలకి గుండెలు అదిరిపోయాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వర్రావు అన్నారు. పొత్తు పార్టీలు సీట్లు ప్రకటించడంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తొలి జాబితా విడుదల చేయగానే తాడేపల్లి ప్యాలెస్ కంపించి బీటలు బారిందని, ఇక తుది జాబితా ప్రకటిస్తే.. ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అవుతుందని అన్నారు. పవన్ కళ్యాణ్ సీటుపై వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి ముందు జగన్ సీటు గురించి మాట్లడాలన్నారు. జగన్ ఎక్కడా పోటీ చేస్తాడో ఎందుకు ప్రకటించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇక టీడీపీ- జనసేన పొత్తులపై, సీట్ల పై వైసీపీ నేతలు ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారంటే వారు భయపడుతున్నట్లు స్పష్టంగా అర్ధం అవుతుందన్నారు. ఎగిరెగిరి పడుతున్న అంబటి రాంబాబుకి సీటు ఉందో లేదో చెప్పాలన్నారు. ఆయనకే సీటు గ్యారెంటీ లేదు కానీ పొత్తులపై ఏదేదో మాట్లాడున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు అనవసరంగా నోరు పారేసుకోవద్దని, తాము 118 స్థానాలు ప్రకటిస్తే చిన్న కుదుపు కూడా లేదని, 80 స్థానాలు ప్రకటించడానికి వైసీపీ అల్లకల్లోలమైందని విమర్శించారు. ఇప్పటికే ఎంపీలు, ఎమ్మెల్యేలు జారీ పోయారని, ఇంకా ముందుంది ముసళ్ల పండగ అని వ్యాఖ్యానించారు. అంతేగాక, టీడీపీ జనసేన అభ్యర్ధుల లిస్టు చూసి వైసీపీ అగ్రనేతలకు ప్యాంట్లు తడిసిపోయాయని, అందుకే సజ్జల అవాకులు చవాకులు పేలారని తీవ్ర విమర్శలు చేశారు. ఇక రాబోయే ఎన్నికల్లో టీడీపీ- జనసేన కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని బోండా ఉమ అన్నారు.
Read More..
మడకశిర టీడీపీలో తీవ్ర ఉద్రిక్తత.. అభ్యర్థి తండ్రిపై చెప్పుల దాడి