ఆర్జీవీ ఏ మెుహం పెట్టుకుని సినిమా తీస్తున్నావ్ : టీడీపీ ధ్వజం

by Disha Web Desk 21 |
ఆర్జీవీ ఏ మెుహం పెట్టుకుని సినిమా తీస్తున్నావ్ : టీడీపీ ధ్వజం
X

దిశ, డైనమిక్ బ్యూరో : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వ్యూహం సినిమాపై మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద షూటింగ్‌ తీయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పట్టిసీమ ప్రాజెక్టుపై అవాకులు చెవాకులు వైసీపీ నాయకులు పేలారని అలాంటి ప్రాజెక్టు వద్ద సినిమా తీసే అర్హత లేదని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. అనంతరం మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే పట్టిసీమ పూర్తి చేసి 13 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుదేనని చెప్పుకొచ్చారు. పట్టిసీమ పథకం దండగని ప్రచారం చేసిన వైసీపీ నాయకులు ఇవాళ ఏ మొహం పెట్టుకొని సినిమా షూటింగ్‌లు చేయిస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఇరిగేషన్‌ ప్రాజెక్టులను తిరిగి నిర్మిస్తాం అని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టులను ఎంతలా నిర్వీర్యం చేస్తున్నారో ప్రజలకు తెలియజేసేందుకు చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లు ఇచ్చారని గుర్తు చేశారు. ఆర్జీవీకి దమ్ముంటే టీడీపీ నిర్మించిన ప్రాజెక్టులపై సినిమా తీయాలి అని దేవినేని ఉమా మహేశ్వరరావు సవాల్ విసిరారు.

Read More : Ram Gopal Varma : ‘పవన్ కల్యాణ్ తప్ప మెగా ఫ్యామిలీలో ఎవరూ నన్ను కామెంట్ చేయలేదు’


Next Story

Most Viewed