మద్యం అక్రమ రవాణాదారుల ఎత్తులను చిత్తు చేస్తున్న పోలీసులు

by Disha Web Desk 18 |
మద్యం అక్రమ రవాణాదారుల ఎత్తులను చిత్తు చేస్తున్న పోలీసులు
X

దిశ ప్రతినిధి,విజయవాడ:అక్రమార్కులు ఎంతో తెలివితేటలతో పల్సర్ బైక్ ట్యాంక్ ను తమ అక్రమ రవాణాకు ఉపయోగించారు.దానిలో పెట్రోలును తొలగించి కోదాడ నుంచి చాకచక్యంగా రవాణా చేస్తున్నామనుకున్న అక్రమార్కులకు" చెక్" పెట్టిన నందిగామ పోలీసులు.ఇలా ఎన్ని మార్గాల్లో ఎన్ని రకాలుగా పోలీసులను ఏమార్చు దామన్న వారి పప్పులను ఉడకనివ్వని పోలీసులను చూసి తలలు పట్టుకుంటున్న అక్రమార్కులు.వారి వద్ద నుంచి 150 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

ఏసీపీ రవి కిరణ్ మాట్లాడుతూ పల్సర్ బైక్ రీ మోడల్ చేసుకుని మద్యం తరలిస్తున్న సమాచారంతో పల్సర్ బైక్ ను నందిగామ శివారులో అదుపులోకి తీసుకున్నామన్నారు. బైకులో ఆశ్చర్యంగా 150 తెలంగాణ మద్యం బాటిళ్లు దర్శనమిచ్చాయి. మద్యం బాటిల్ బైక్ సీజ్ చేశామని ఆయన తెలిపారు. చాకచక్యంగా మద్యం పట్టుకున్న సీఐ హనీష్ ను ఎస్సై పండు దొర పోలీస్ ఎస్సై దుర్గ మహేశ్వర రావుని ఏసీపీ రవికిరణ్ అభినందించారు.

Next Story

Most Viewed