Visakha: సాహితీఫార్మా అగ్ని ప్రమాద బాధితులకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా

by Disha Web Desk 16 |
Visakha: సాహితీఫార్మా అగ్ని ప్రమాద బాధితులకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా అచ్యుతాపురం సాహితీ ఫార్మా అగ్ని ప్రమాద బాధితులను మంత్రి గుడివాడ అమర్ నాథ్ పరామర్శించారు. మృతులకు రూ. 25 లక్షలు ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కేజీహెచ్ అధికారులను ఆదేశించారు. కాగా సాహితీ ఫార్మాలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వీరిని కేజీహెచ్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి కేజీహెచ్‌కు వెళ్లి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.


మరోవైపు సాహితీ ఫార్మాలో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అటు పోలీసులు సైతం ఘటనా స్థలంలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story

Most Viewed