Visakha: ఐపీఎల్‌కు వెళ్తూ స్వరూపానందేంద్ర స్వామిని కలిసిన క్రికెటర్ భరత్

by Disha Web Desk 16 |
Visakha: ఐపీఎల్‌కు వెళ్తూ స్వరూపానందేంద్ర స్వామిని కలిసిన క్రికెటర్ భరత్
X

దిశ, ఉత్తరాంధ్ర: భారత క్రికెటర్, వికెట్ కీపర్ కేఎస్ భరత్ విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. భార్య అంజలితో కలిసి రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. గుజరాత్ టైటాన్ తరపున ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడేందుకు అహ్మదాబాద్ క్యాంప్‌కు వెళుతున్నట్లు భరత్ తెలిపారు. అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతుల ఆశీస్సుల కోసం విశాఖ శారదాపీఠాన్ని సందర్శించినట్లు కేఎస్ భరత్ పేర్కొన్నారు.



Next Story

Most Viewed