ఇండియా–పాక్ వార్.. విశాఖలో అనుమానాస్పద వ్యక్తి

by Jakkula Mamatha |   ( Updated:2025-05-10 08:36:21.0  )
ఇండియా–పాక్ వార్.. విశాఖలో అనుమానాస్పద వ్యక్తి
X

దిశ,వెబ్‌డెస్క్: పహల్గాం ఉగ్రదాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న భారత్.. పాక్ ఉగ్రమూకల స్థావరాలపై ఈ నెల 7న ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) పేరుతో మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. దీంతో భారత్ పలు రాష్ట్రాల్లో బ్లాక్ అవుట్ విధించింది. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే తిరుమ(Tirumala)లలో ఆక్టోపస్ బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండియా–పాక్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో విశాఖ(Vishakapatnam) ఎయిర్‌పోర్టులో భద్రత కట్టుదిట్టం చేశారు.

ఈ తరుణంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు (సీఐఎస్‌ఎఫ్‌) వాహనాలను తనిఖీలు చేశారు. అనంతరం భారత్–పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో విశాఖలో హై అలర్ట్ జారీ చేశారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐఎస్‌ఎఫ్‌, పోలీసులతో నిరంతర సమన్వయం చేసుకుంటూ భద్రతా చర్యలు అమలు చేస్తున్నారు. విమానాశ్రయం లోపల, వెలుపల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ప్రతి కదలికను నిశీతంగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ ఆందోళనకు గురి చేశాడు. సిరిపురం జంక్షన్ వద్ద ఫొటోలు తీస్తున్న సదరు వ్యక్తిని విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పరిణామాల మధ్య ఆ వ్యక్తి అనుమానాస్పదంగా తిరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.



Next Story

Most Viewed