AP Politics:రాష్ట్రంలో కూటమి విజయం తధ్యం.. బీజేపీ నేత

by Disha Web Desk 18 |
AP Politics:రాష్ట్రంలో కూటమి విజయం తధ్యం.. బీజేపీ నేత
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం:రాష్ట్రంలో కూటమి విజయం తధ్యమని అనకాపల్లి నుంచి కూటమి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ నేత సీఎం రమేష్ అన్నారు.శుక్రవారం ఉదయం ఆయన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.ప్రచారం ప్రారంభించేందుకు అనకాపల్లికి బయల్దేరారు. ఆ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, స్వామి ఆశీస్సులతో ప్రచారం ప్రారంభించడం ఆనందదాయకమని అన్నారు.కేంద్రంలో మూడోసారి NDA ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని, రాష్ట్రంలో కూటమి విజయం సాధిస్తుందని అన్నారు. కూటమికి అభ్యర్దులకు ఓటు వేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి పాటు పడాల్సింది గా పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు పీవీ మాధవ్, రాము నాయుడు తదితరులు ఆయన వెంట ఆలయానికి వెళ్లారు.

Read More..

టీడీపీ తోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం: రెడ్డి సుబ్రహ్మణ్యం


Next Story

Most Viewed