రెండు లారీలు ఢీ: ఇద్దరు స్పాట్‌డెడ్

by Vemula.Srinu Prasad |

రెండు లారీలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు...

రెండు లారీలు ఢీ: ఇద్దరు స్పాట్‌డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: రెండు లారీలు(Lorries) ఢీకొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఏలూరు జిల్లా(Eluru District) కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం(BayyannaGudem)లో జరిగింది. కొబ్బరికాయల లోడ్‌తో వెళ్తున్న లారీ(Lorry)ని.. వెనక నుంచి వచ్చిన మరో లారీ అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ రాజేశ్‌తో పాటు క్లీనర్ లక్ష్మణ్ సైతం స్పాట్‌లోనే చనిపోయారు. కొబ్బరికాయల లోడ్‌తో లారీ పాలకొల్లు నుంచి హైదరాబాద్‌(Hyderabad)కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story