జగన్ ఇంటికి ఒంటిమిట్ట ఆలయ అర్చకులు: టీటీడీ సీరియస్.. నోటీసులు

by Vemula.Srinu Prasad |

ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ అర్చకులపై తిరుమల తిరుపతి దేవస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలను ఉల్లంఘించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు వేదాశీర్వచనం అందించినందుకు గాను ముగ్గురు అర్చకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

జగన్ ఇంటికి ఒంటిమిట్ట ఆలయ అర్చకులు: టీటీడీ సీరియస్.. నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ అర్చకుల(Ontimitta Kodandaramaswamy Temple Priests)పై తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలను ఉల్లంఘించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy) నివాసానికి వెళ్లి ఆయనకు వేదాశీర్వచనం అందించినందుకు గాను ముగ్గురు అర్చకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆలయ మర్యాదలు, ప్రోటోకాల్‌ను పాటించకుండా వ్యక్తిగత పర్యటనలు చేయడంపై యాజమాన్యం సీరియస్‌గా స్పందించింది.

రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలి...

ఈ నోటీసులపై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అర్చకులను టీటీడీ ఆదేశించింది. ఒకవేళ వారు ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేని పక్షంలో కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఆలయ పవిత్రతను, నిబంధనలను కాపాడటంలో ఎటువంటి అలసత్వాన్ని సహించబోమని టీటీడీ(TTD) వర్గాలు హెచ్చరించాయి.

Next Story