శ్రీవారి భక్తులకు అలర్ట్.. మార్చి 3న ఆలయం మూసివేత

by Ajay Maddhiboyina |

తిరుమల శ్రీవారి ఆలయాన్ని మార్చి 3వ తేదీన యూసివేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.

శ్రీవారి భక్తులకు అలర్ట్.. మార్చి 3న ఆలయం మూసివేత
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి ఆలయాన్ని మార్చి 3వ తేదీన యూసివేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. చంద్రగ్రహణం కారణంగా ఆ రోజున ఆలయాన్ని మూసివేయనున్నట్టు ప్రకటించింది. మధ్యాహ్నం 3.20 నిమిషాలకు గ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.47 నిమిషాలకు పూర్తవుతుందని పేర్కొంది. సాధారణంగా గ్రహణం సమయానికి ఆరు గంటలు ముందుగానే ఆలయాన్ని మూసివేయడం అనేది అనవాయితీ. ఈ నేపథ్యంలోనే ఉదయం 9గంటల నుండి సాయంత్రం 7.30నిమిషాల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. కాబట్టి తిరుమల వెళ్లాలని ప్లాన్ చేసుకునే భక్తులు అలర్ట్ గా ఉండటం మంచింది. ఒకవేళ టికెట్లు బుక్ చేసుకుంటే దర్శనం కోసం ఎదురుచూడాల్సి వచ్చి మరో రోజు కూడా తిరుమలలోనే ఉండాల్సి వస్తుంది.

Next Story