కాపు ఉద్యమకారులకు బిగ్ షాక్.. ఆ కేసులపై అప్పీల్‌కు వెళ్లనున్న ప్రభుత్వం

by Vemula.Srinu Prasad |

కాపు ఉద్యమకారులకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది...

కాపు ఉద్యమకారులకు బిగ్ షాక్.. ఆ కేసులపై అప్పీల్‌కు వెళ్లనున్న ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్: కాపు ఉద్యమకారులకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వం కొట్టివేసిన కేసులుపై మళ్లీ విచారించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైకోర్టులో అప్పీల్ చేయాలని పీపీని ఆదేశించింది. దీంతో హోంశాఖ ముఖ్యకార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. కాపు ఉద్యమంలో భాగంగా అప్పటి నేత ముద్రగడ పద్మనాభం రైలు రోకో నిర్వహించారు. అయితే ఈ నిరసనలో కొన్ని ఆస్తులు ధ్వంసం అయ్యాయి. దీంతో పద్మనాభంతో పాటు పలువురిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులను విజయవాడ రైల్వే కోర్టు(Vijayawada Railway Court) కొట్టివేసింది. దీంతో కాపు ఉద్యమకారులపై ఉన్న కేసులను గత ప్రభుత్వం కొట్టివేసింది. ఇప్పుడు ఈ కేసులపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Next Story