నదిలో నరకం.. ప్రాణభయంతో గడిపిన స్వాములు

by Dishanational2 |
నదిలో నరకం.. ప్రాణభయంతో గడిపిన స్వాములు
X

దిశ, కర్నూలు ప్రతినిధి : ఏపీ,-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని సిద్దేశ్వరం-సోమశిల ప్రాంతాల్లో నెలకొన్న ఘాట్ బోట్ల పంచాయితీ శివ స్వాములపై తీవ్ర ప్రభావం చూపింది. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ ప్రాంతంలోని కొల్లాపూర్, పెంట్లవెళ్లి, పాన్ గల్, నాగర్ కర్నూల్, వనపర్తి తదితర ప్రాంతాలకు చెందిన శివ స్వాములు సంగమేశ్వర క్షేత్రాన్ని దర్శించుకుని కాలినడకన శ్రీశైలం వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అనుకున్నట్లు గానే వారంతా సోమశిల చేరుకున్నారు. అయితే నెల క్రితం నుంచి కృష్ణానదిపై ఘాట్

బోట్ల రవాణాను జిల్లా అధికారులు నిషేధించారు. అప్పటి నుంచి నేటి వరకు నదిలో ఎలాంటి బోట్లు తిరగడం లేదు. అయితే తెలంగాణకు చెందిన ఘాట్ బోట్ల నిర్వాహకులు మాత్రం అక్కడి అధికారులు, రాజకీయ నాయకుల పలుకుబడితో వారి సరిహద్దుతోపాటు సంగమేశ్వరం, మల్లేశ్వరం, సోమశిల, ఇటు ముచ్చుమర్రికి మధ్యన ఉన్న మినీ ఐ ల్యాండ్ కు పర్యాటకులను చేరవేసేవారు. ఈ విషయం తెలియని శివస్వాములు బోటు దాటేందుకు వచ్చారు. కానీ ఘాట్ బోట్ నిర్వాహకులు వారిని బోట్లలో ఎక్కించుకుని మినీ ఐ ల్యాండ్ చూపించి అక్కడే వదిలారు. సంగమేశ్వరంగానీ, సిద్దేశ్వరంగానీ వెళ్లేందుకు తమకు అనుమతి లేదని, అక్కడి వారు వచ్చి తీసుకెళ్తారని చెప్పడంతో పర్యాటకులు నోరెళ్లబెట్టారు. చేసేదిలేక మళ్లీ బోట్ల ద్వారా సోమశిలకు వెళ్లిపోయారు.

ప్రత్యామ్నాయం చూపని అధికారులు

అయితే నెల రోజుల క్రితం నుంచి ఘాట్ బోట్ల రాకపోకలను నిషేధించిన ఏపీకి చెందిన నంద్యాల జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపలేదు. దీంతో భక్తులతోపాటు ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.



Next Story

Most Viewed