Breaking: పైడిభీమవరంలో మహిళ దారుణ హత్య

by Vemula.Srinu Prasad |

కాకుళం జిల్లా పైడిభీమవరంలో దారుణం జరిగింది....

Breaking: పైడిభీమవరంలో మహిళ దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం(Pydibhimavaram)లో దారుణం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ దారుణ హత్య(brutal murder)కు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడపై బ్లేడుతో కోసారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. రక్తపు మడుగులో ఉన్న మహళను స్థానికులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలు భవానీగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. భవానీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. స్థానిక సీసీటీవీ ఫుటేజులను పరిశీలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కేసును త్వరగా చేధిస్తామని తెలిపారు.

Next Story