- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాడిపత్రిలో మళ్లీ టెన్షన్ టెన్షన్
తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తరవాత టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు ఒకరిపై ఒకరు దాడి

తెలంగాణ, వెబ్ డెస్క్: తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తరవాత టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరవాత కూడా తాడిపత్రిలో ఇరు వర్గాల మధ్య ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.
తరచూ తాడిపత్రిలో పెద్దారెడ్డిని అడుగుపెట్టనివ్వనంటూ జేసీ సవాల్ చేస్తుంటే అడుగుపెట్టి తీరతానంటూ పెద్దారెడ్డి సవాల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు తాడిపత్రిలో వైసీపీ రీకాలింగ్ చంద్రబాబు మానిఫెస్టో కార్యక్రమం జరగనుండగా పెద్దారెడ్డి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాడిపత్రిలో కార్యక్రమానికి హాజరవుతానని పెద్దారెడ్డి చెబుతున్నారు. మరోవైపు పెద్దారెడ్డిని రానిచ్చేది లేదని ఇప్పటికే జేపీ వార్నింగ్ ఇచ్చారు. దీంతో తాడిపత్రి, తిమ్మంపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు.






