- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బిక్కుబిక్కుమంటున్న తెలుగు విద్యార్థులు

బిక్కుబిక్కుమంటున్న తెలుగు విద్యార్థులు
బాంబుల మోత మధ్య భయాందోళన
కాపాడాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కు విద్యార్థుల విజ్ఞప్తి
అక్కడి కలెక్టర్, ఎస్కేయుఏఎస్టీ డీన్కు కేంద్రమంత్రి లేఖ
విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు పంపుతున్న యంత్రాంగం
దిశ, డైనమిక్ బ్యూరో : భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని తెలుగు విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని తెలుగు విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.జమ్మూలో కాల్పులు, బాంబు దాడుల కొనసాగుతుండడటంతో వారు భయాందోళన చెందుతున్నారు. జమ్మూ కాశ్మీర్ లోని షేర్-ఇ-కాశ్మీరీ వ్యవసాయ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఎస్కేయుఏఎస్టీ)లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన 23 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. బాంబుల మోతతో ఆందోళన చెందుతున్నామని, తమను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఎయిర్పోర్టులు కూడా మూసేయడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు విన్నవించారు. స్పందించిన ఆయన అక్కడి కలెక్టర్, యూనివర్సిటీ డీన్తో మాట్లాడారు. ఆయన చొరవతో విద్యార్థులను జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమైంది. తెలంగాణ, ఏపీ, తమిళనాడుకి చెందిన మొత్తం 23 మంది విద్యార్థులను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు పంజాబ్లోని ఎల్పీయూ యూనివర్సిటీలో చదువుతున్న పలువురు తెలుగు విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. భారత్, పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో పంజాబ్లో యూనివర్సిటీల పరీక్షలు వాయిదా వేశారు