- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రెక్కలు ఊడిన ఫ్యాన్ చెత్తకుప్పలో ఉండాలి.. జగన్ వ్యాఖ్యలపై టీడీపీ మాస్ కౌంటర్
దిశ, డైనమిక్ బ్యూరో: చంద్రబాబు మోసాలు భరించలేక ప్రజలు ఐదేళ్ల క్రితమే చొక్కా మడతేశారని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. ఇవాళ రాప్తాడులో నిర్వహించిన వైసీపీ సిద్ధం ప్రచార సభలో టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. చంద్రబాబు కుర్చీలు మడిచి 23 సీట్లకు తగ్గించారని, మరోసారి చొక్కా మడత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? అని ప్రజలను ప్రశ్నించారు. మరోవైపు ఫ్యాన్ ఇంట్లో ఉండాలని, సైకిల్ బయట ఉండాలని, గ్లాస్ సింకులో ఉండాలని టీడీపీ, జనసేన పార్టీలను పరోక్షంగా విమర్శించారు.
ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ పార్టీ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా కౌంటర్ ఇచ్చింది. ‘దేన్ని ఎక్కడ ఉంచాలో జనానికి బాగా తెలుసు జగన్. విరిగిపోయిన నీ ఫ్యాన్ ని చెత్తకుప్పలో వేయడానికి జనం సిద్ధం’ అని కౌంటర్ ఇచ్చింది. రెక్కలు ఊడిన ఫ్యాన్ చెత్తకుప్పలో ఉండాలని సీఎం జగన్ ఫోటో పోస్ట్ చేసింది.