Chandrababu: రాష్ట్రమా...రావణ కాష్ఠమా ?.. రెండు నిమిషాల వీడియాతో తీవ్ర ఆగ్రహం

by Disha Web Desk 16 |
Chandrababu: రాష్ట్రమా...రావణ కాష్ఠమా ?.. రెండు నిమిషాల వీడియాతో తీవ్ర ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా జరుగుతున్న నేరాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రమా...రావణ కాష్ఠమా అంటూ పలు ఘటనలు ప్రస్తావిస్తూ రెండు నిముషాల వీడియోతో చంద్రబాబు ట్వీట్ చేశారు. రేపల్లెలో విద్యార్థి సజీవ దహనం, ఏలూరులో మహిళపై యాసిడ్ దాడి ఘటనలపై వీడియోలో చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు.

మచిలీపట్నం, నెల్లూరులలో జరిగిన అత్యాచారాల ఘటనలను ప్రస్తావిస్తూ సీఎం జగన్‌పై చంద్రబాబు ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఆయా నేరాల్లో అధికార పార్టీ నేతల అకృత్యాలపై సీఎం జగన్ మౌనాన్ని ప్రశ్నిస్తూ చంద్రబాబు వీడియో చేశారు. ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఒక్క ఘటనపైనా జగన్ సీరియస్‌గా స్పందించక పోవడాన్ని చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. జగన్ చెప్పుకుంటున్నట్లు ప్రజల బిడ్డ కాదని....ప్రజల ప్రాణాలకు వెలకట్టే పెత్తందారు అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి : Anil Kumar Yadav: ‘మగాడివైతే నాపై పోటీ చేయ్.. ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తా’


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed