విజయనగరం జిల్లాలో విద్యార్థిని మృతి

by Thanuru Gopichand |

విజయనగరం జిల్లాలో ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

విజయనగరం జిల్లాలో విద్యార్థిని మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : విజయనగరం జిల్లాలో ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ విషయాన్ని కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. సమాచారం ప్రకారం విజయనగరంలోని గొట్లాంలో ఉన్న గాయత్రి కళాశాలలో ఓ విద్యార్థిని చదువుతోంది. ఆ విద్యార్థిని ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు తమ కుమార్తె మృతి పట్ల కన్నీరుమున్నీరు అవుతున్నారు. తమ బిడ్డ మరణానికి కాలేజీ యాజమాన్యమే కారణమని ఆరోపిస్తున్నారు. విద్యార్థిని మృతిపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. అసలు విద్యార్థిని ఎందుకు మరణించింది? ఆమె మరణానికి గల కారణాలపై సందేహాలు కలుగుతున్నాయి. అయితే ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story